రైతులతో రచ్చబండ నిర్వహించిన భట్టి విక్రమార్క

రైతులతో రచ్చబండ నిర్వహించిన భట్టి విక్రమార్క
నాగార్జున సాగర్‌ నియోజకవర్గం వద్దిరెడ్డిగూడెం గ్రామంలో రైతులతో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు భట్టి.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క... పీపుల్స్‌ మార్చ్‌ కొనసాగుతోంది. నాగార్జున సాగర్‌ నియోజకవర్గం వద్దిరెడ్డిగూడెం గ్రామంలో రైతులతో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు భట్టి. ఈ సందర్భంగా తమ సమస్యలు చెప్పుకున్నారు మహిళలు. రుణమాఫి కాలేదని, దీంతో బ్యాంకులు అప్పులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ అవుతుందని...తాము వడ్డీ కట్టలేదని దీంతో తమను రుణ ఎగవేతదారులుగా ప్రకటించారన్నారు. ఇక పండిన పంటకు మద్దతు ధర లేదన్నారు. ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదంటూ తమ సమస్యలు చెప్పుకున్నారు మహిళలు.

Tags

Read MoreRead Less
Next Story