Sangareddy: ఆగిన కండక్టర్ గుండె...

Sangareddy: ఆగిన కండక్టర్ గుండె...
విధులు నిర్వహిస్తుండగా స్ట్రోక్ కు గురైన కండక్టర్; ఆసుపత్రికి తరలించే లోగానే మృత్యఒడిలోకి జారుకున్న వైనం

మరో గుండే ఆగింది... ఉదయం బ్యాడ్మింటన్ ఆడుతూ ప్రాణాలు కోల్పోయిన యువకుడు ఇంకా కళ్ల ముందు కదులుతూనే ఉండగా, మరో వ్యక్తి హార్ట్ స్ట్రోక్ కు గురై ప్రాణాలు కోల్పోయాడు. కదులుతున్న బస్సులోనే సదరు వ్యక్తి ప్రాణాలు గాల్లో కలసిపోయినట్లు తెలుస్తోంది. మెదక్ జిల్లాలోని నర్సాపూర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. కండక్టర్ గా విధులు నిర్వహిస్తోన్న భిక్షపతి విధులు నిర్వహిస్తుండగానే అసక్మాత్తుగా గుండెపోటుకు గురైయ్యారని ప్రయాణీకులు తెలిపారు. హుటాహుటిన ఆటోలో భిక్షపతిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. బస్సు ప్రజ్ఞ్యాపూర్ నుంచి సంగారెడ్డికి వెళుతున్నట్లు తెలుస్తోంది. అయితే భిక్షపతి మరణానికి ఉన్నతాధికారులే కారణమంటూ ఆర్టీసీ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఆరోగ్యం బాలేదని భిక్షపతి సెలవు కోరగా ఉన్నతాధికారి నిరాకరించినట్లు పేర్కొన్నారు. దీంతో చేసేది లేక, అనారోగ్యంతోనే ఆయన విధులకు హాజరైనట్లు తెలుస్తోంది. దీంతో పాటూ చెకింగ్ అధికారులు సైతం భిక్షపతికి మెమో ఇచ్చారని, దీంతో ఆయన మరింత ఒత్తిడికి లోనైనట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story