సంజయ్ చేసిన సర్జికల్ స్ట్రైక్ వ్యాఖ్యలపై స్పందించిన స్మృతి ఇరానీ

సంజయ్ చేసిన సర్జికల్ స్ట్రైక్ వ్యాఖ్యలపై స్పందించిన స్మృతి ఇరానీ

హైదరాబాద్ ప్రజల తరపున బీజేపీ చార్జ్‌షీట్ దాఖలు చేసిందన్నారు కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత స్మృతి ఇరానీ. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా ప్రచారానికి హైదరాబాద్ వచ్చిన ఆమె... టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజల మద్దతు లేదన్నారు. టీఆర్‌ఎస్‌- ఎంఐఎం రెండు ఒక్కటేనన్నారు. ఎంఐఎంకి టీఆర్‌ఎస్‌ మద్దతు లేనిదే.. రొహింగ్యాలు హైదారాబాద్‌లో ఉండగలుగుతున్నారా అని ప్రశ్నించారు స్మృతి ఇరానీ. అక్రమ వలసదారులకు టీఆర్‌ఎస్‌-ఎంఐఎం మద్దతిస్తున్నారని ఆరోపించారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన సర్జికల్ స్ట్రైక్ వ్యాఖ్యలపైనా ఇరానీ స్పందించారు. అవినీతి, అభివృద్ధి , టీఆర్‌ఎస్ తీరుపైనే సర్జికల్ స్ట్రైక్‌ చేస్తామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story