Secunderabad: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో దారుణ పరిస్థితి.. ఒకరి మృతి

Secunderabad: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో దారుణ పరిస్థితి.. ఒకరి మృతి
Secunderabad: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భయానకంగా మారింది. ఆందోళన కారుల విధ్వంసంతో నష్టం భారీ స్థాయిలో ఉంది.

Secunderabad: పోలీసులపై రాళ్లు రువ్విన ఆందోళన కారులు

ఒకటో నెంబర్ ఫ్లాట్ ఫారమ్ పై వ్యక్తి మృతి

రాళ్ల దాడులను అరికట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు

సికింద్రాబాద్ కు రావల్సిన రైళ్లనీ ఎక్కడికక్కడ నిలిపివేత

అదుపులోకి రాని పరిస్థితి

స్టేషన్ వద్దే ఉన్న 2వేల మంది నిరసనకారులు

పోలీసుల కాల్పుల్లో ఒకరి మృతి, అధికారికంగా ధృవీకరించని అధికారులు

సికింద్రాబాద్ క్లాక్ టవర్ నుంచి ట్రాఫిక్ మళ్లింపు

స్టేషన్ కు వచ్చే అన్ని బస్సులు బంద్

సిగ్నల్ వ్యవస్థను ధ్వంసం చేసిన ఆందోళనకారులు

రైళ్ల సిగ్నల్ వ్యవస్థ, సీసీ కెమెరాలు ధ్వంసం

అగ్నిపథ్ ను రద్దు చేయాలని నినాదాలు చేస్తున్న ఆందోళన కారులు

తగుల బెట్టింది 3,4 బోగీలే అయినా భారీ ఎత్తున విధ్వంసం జరిగింది. నష్టం భారీ స్థాయిలో ఉంది.

ఆందోళనకారులను నివారించకపోతే నష్టం మరింత పెరిగే స్థాయిలో ఉంది..

Tags

Read MoreRead Less
Next Story