అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై టీడీపీ ఆగ్రహం

అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై టీడీపీ ఆగ్రహం

దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహరావు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఘాట్‌లను కూల్చివేయాలంటూ.. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద తెలుగు యువత ఆధ్వర్యంలో.. ఎంఐఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు టీడీపీ శ్రేణులు.

గ్రేటర్ ఎన్నికల వేళ మత విద్వేశాలను రెచ్చగొట్టేలా టీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీల నేతలు మాట్లాడటం సిగ్గుచేటన్నారు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌ రమణ. తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటిన ఎన్టీఆర్, పీవీ నరసింహారావుపై చేసిన వ్యాఖ్యలకు ఎంఐఎం నేతలు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story