నాగార్జున సాగర్ ఉప ఎన్నికకి టీడీపీ సై..
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీకి సై అంటోంది. టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మువ్వా అరుణ్ కుమర్ను ప్రకటించినట్లు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్ గౌడ్ తెలిపారు. న్యాయవాది అయిన అరుణ్ కుమార్ను 1985 నుంచి టీడీపీలో పనిచేస్తున్నాడని, ఉచితంగా న్యాయ సేవలు అందిస్తున్నాడని ఆయన తెలిపారు.
ఇక పట్టభద్రుల ఎన్నికల్లో సైతం రెండు స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్నట్లు అరవింద్ కుమార్ గౌడ్ తెలిపారు . టీడీపీ హయాంలో జరిగిన అభివృద్దే తమ అభ్యర్థిని గెలిపిస్తాయని అరవింద్ కుమార్ ధీమావ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన తనకు నాగార్జున సాగర్ టికెట్ ఇచ్చిన చంద్రబాబుకు అరుణ్ కుమార్ కృతజ్ఙతలు తెలిపారు .
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com