తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభం

తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభం
నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య చిత్ర పటానికి కేటీఆర్ నివాళులర్పించారు

తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం కొనసాగుతోంది..ఈ సమావేశానికి దాదాపు 412 మంది ప్రజాప్రతినిధులు, రాష్ట్ర కమిటీ సభ్యులు హాజరయ్యారు. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య చిత్ర పటానికి కేటీఆర్ నివాళులర్పించారు. ముఖ్యంగా పార్టీ విస్తరణ, కమిటీల ఏర్పాటు అంశంపైనే ప్రధాన చర్చ ఉంటుందని తెలుస్తోంది.. అలాగే ఈనెల 10న హాలియాలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా సీఎం కేసీఆర్ ప్రారంభించబోతున్నారు.

ఇక ఈ సమావేశంలో అందరూ అనుకుంటున్నట్లు సీఎం మార్పు ప్రచారం పైనా చర్చ జరగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిన్నమొన్నటివరకు కేటీఆర్ సీఎం కావాలంటూ ప్రకటన చేసిన నాయకులు.. ఇప్పుడు అధినేత కేసీఆర్ ముందు కూడా మాట్లాడతారా లేదా అనేది సస్పెన్స్‌గా మారింది. కేటీఆర్‌ను సీఎంగా ఖరారు చేస్తారనే ప్రచారం నేపథ్యంలో.. టీఆర్ఎస్ నేతల్లోనూ ఈ సమావేశం పై ఆసక్తి నెలకొంది.

మరోవైపు నాగార్జున సాగర్ ఉప ఎన్నికపైనా సమావేశంలో చర్చించనున్నారు. అలాగే ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఆయా జిల్లాల నుంచి సీనియర్ నాయకులు కూడా సమావేశానికి హాజరయ్యారు.


Tags

Read MoreRead Less
Next Story