మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్!
By - TV5 Digital Team |12 Jan 2021 5:02 AM GMT
కరోనా ఎవరిని వదలడం లేదు. తాజాగా మరో ప్రజాప్రతినిధి కరోనా బారిన పడ్డారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి కరోనా వచ్చినట్టుగా వైద్యులు గుర్తించారు.
కరోనా ఎవరిని వదలడం లేదు. తాజాగా మరో ప్రజాప్రతినిధి కరోనా బారిన పడ్డారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి కరోనా వచ్చినట్టుగా వైద్యులు గుర్తించారు. ఆయనతో పాటుగా అయన కుమార్తె శ్రేయ రెడ్డి, ఆయన గన్ మెన్ స్వామికి కరోనా వచ్చినట్టుగా వెల్లడించారు. ప్రస్తుతం భూపాల్ రెడ్డి స్వీయ నిర్భంధంలో ఉన్నారు. గత కొద్ది రోజులుగా తనని కలిసిన వారు కరోనా టెస్టులు చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి త్వరగా కోలుకోవాలని పార్టీ నేతలు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఇక అటు ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే!
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com