టీటీడీపీ శాసనసభాపక్షం టీఆర్ఎస్లో విలీనం..

X
By - TV5 Digital Team |7 April 2021 6:00 PM IST
తెలంగాణ టీడీపీ శాసనసభాపక్షం టీఆర్ఎస్లో విలీనం కానుంది. తెలంగాణలో తెలుగుదేశానికి ఉన్న ఏకైక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్రావు.. పార్టీకి రాజీనామా చేశారు.
తెలంగాణ టీడీపీ శాసనసభాపక్షం టీఆర్ఎస్లో విలీనం కానుంది. తెలంగాణలో తెలుగుదేశానికి ఉన్న ఏకైక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్రావు.. పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పటికే ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ అయ్యారు. అలాగే టీడీపీ శాసనసభాపక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు.. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఓ లేఖ అందించారు. అలాగే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో ఎమ్మెల్యే భేటీ అయ్యారు. కాసేపట్లో టీడీపీ విలీనంపై అసెంబ్లీ కార్యదర్శి అధికారిక బులెటిన్ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com