ఎన్టీఆర్‌ వల్లే చాలా మంది బీసీలు ఎదిగారు: కాసాని

ఎన్టీఆర్‌ వల్లే చాలా మంది బీసీలు ఎదిగారు: కాసాని
ఎన్టీఆర్‌ నిర్ణయాల వల్లే తనలాంటి చాలామంది బీసీలు ఎదిగారన్నారు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌

ఎన్టీఆర్‌ నిర్ణయాల వల్లే తనలాంటి చాలామంది బీసీలు ఎదిగారన్నారు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌. పేదోళ్లకు కడుపునిండా తిండి దక్కాలన్న ఉద్దేశంతో.. ఆనాడు ఎన్టీఆర్‌ రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చారని అన్నారు. ఎన్టీఆర్‌ ఏం చేసినా సంచలనమేనన్న ఆయన.. ఎప్పటికీ ఎన్టీఆర్‌ను ప్రజలు మర్చిపోలేరని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ సిద్ధాంతాల్ని చంద్రబాబు మరింత ముందుకు తీసుకెళ్లారని కొనియాడారు. విజన్‌ 2020ని.. 2050 దాకా పొడిగించాలని.. విజన్‌ 2050 కోసం ప్రజలు తమకు లేఖలు రాస్తున్నారని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story