Telangana BJP: హాట్ టాపిక్ గా ఈటెల మౌనం
తెలంగాణ బీజేపీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. సీనియర్ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యవహార శైలి హాట్ టాపిక్ గా మారింది. ఈటల బీజేపీని వీడతారనే ప్రచారం జోరుగా నడుస్తోంది. కొంతకాలంగా ఆయన మౌనంగా ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఢిల్లీకి సైతం వెళ్లి హైకమాండ్తో సమావేశమై వచ్చారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆయన భార్యతో కలిసి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఏం ప్రకటన చేస్తారోనని తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
గత కొన్ని రోజులుగా ఈటల పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ ఆఫీసుకి కూడా రావడం లేదు. ఆయనకు బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి ఇస్తారనే వార్తలు వచ్చాయి. దీంతో ఆయనకు వ్యతిరేకంగా పలువురు సీనియర్లు సమావేశమై చర్చించినట్లు తెలుస్తోంది.అప్పటి నుంచి మీడియాకు దూరంగా ఉంటూ మౌనం వహిస్తున్నారు. ఈటెల మౌనం వెనుక ఉద్దేశం ఏమిటనేది అటు పార్టీలో ఇటు అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com