విశాఖలో విదేశీ యువతుల వ్యభిచారం గుట్టురట్టు
By - Vijayanand |9 Jun 2023 7:06 AM GMT
విశాఖలో విదేశీ యువతుల వ్యభిచారం గుట్టురట్టైంది. అరిలోవ ఆదర్శనగర్ లో ఉన్న ఆరెంజ్ ఇన్ హోటల్ లో థాయిలాండ్ కు చెందిన ఇద్దరు యువతులు, అరకుకు చెందిన ఒక యువతి వ్యభిచారం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మధ్యవర్తి -విదేశీ యువతుల మధ్య జరిగిన ఘర్షణతో వ్యవహారం బట్టబయలైందని చెప్పారు. విదేశీ యువతుల పాస్పోర్ట్ తీసుకుని, వారిపై బ్రోకర్ మహేష్ దాడులు చేసినట్లు నగర సీపీ వాట్సప్ నెంబర్ కు బాధిత యువతులు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు యువతులను అదుపులోకి తీసుకుని మహేష్ కోసం గాలిస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com