Video Viral: షాకింగ్.. పేషెంట్‌గా వచ్చి పేపర్ చదువుతూ ప్రాణాలు వదిలి..

Video Viral: షాకింగ్.. పేషెంట్‌గా వచ్చి పేపర్ చదువుతూ ప్రాణాలు వదిలి..
Video Viral: గుండెపోటు.. ఉన్నట్టుండి మనిషి ప్రాణాలు తీస్తుంది. సెకను వ్యవధిలో ప్రాణాలు కోల్పోతారు. చుట్టూ అందరూ ఉన్నట్టే ఉంటారు. ఏం జరుగుతుందో ఎవరికీ ఏమీ అర్థం కాదు.

Viral Video: గుండెపోటు.. ఉన్నట్టుండి మనిషి ప్రాణాలు తీస్తుంది. సెకను వ్యవధిలో ప్రాణాలు కోల్పోతారు. చుట్టూ అందరూ ఉన్నట్టే ఉంటారు. ఏం జరుగుతుందో ఎవరికీ ఏమీ అర్థం కాదు. రాజస్థాన్‌ బార్మర్‌లోని క్లినిక్‌‌కు వ్యాపారవేత్త 61 ఏళ్ల దిలీప్ కుమార్ మదానీ పంటి నొప్పితో దంతవైద్యుని వద్దకు వచ్చారు. ఆయన వంతు వచ్చే వరకు వెయిట్ చేస్తూ అక్కడే ఉన్న పేపర్ తీసి చదువుతున్నారు. ఇంతలోనే ఆయనకు ఏదోలా అనిపించింది. పేపర్ పక్కన పెట్టారు. అంతలోనే పక్కకు ఒరిగి కింద పడిపోయి ప్రాణాలు కోల్పోయారు.

క్లినిక్‌లోని సిబ్బంది మదానీకి సహాయం చేసేందుకు వచ్చారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాని అతన్ని రక్షించలేకపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లినిక్‌లోని సీసీటీవీలో రికార్డైంది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మదానీ గుజరాత్‌లోని సూరత్‌లో బట్టల వ్యాపారం చేస్తున్నారు. ఒక సామాజిక కార్యక్రమం కోసం నవంబర్ 4న బార్మర్‌కు వచ్చారు. నవంబర్ 5 న పంటి వైద్యుడిని కలిసేందుకు క్లినిక్‌ని సందర్శించాడు. కానీ వైద్యుడిని కలవకముందే, వ్యాపారవేత్త నేలపై కుప్పకూలి ప్రాణాలు వదిలాడు.

మదానీకి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వారు తండ్రి వ్యాపారాన్ని చూసుకుంటున్నారు. బార్మెర్‌లోని పచ్‌పద్రలో నివసిస్తున్నారు. గత నెలలో, గుండెపోటుతో ఒక జిమ్ ట్రైనర్ కుర్చీలోనే కుప్పకూలాడు. మరో వ్యక్తి డ్యాన్స్ చేస్తూ గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. ఈ మధ్య తరచుగా ఇలాంటి వార్తలు వినాల్సి వస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story