Greece: ఘోర ప్రమాదం.. ఒకే ట్రాక్‌పై ప్రయాణిస్తున్న రెండు రైళ్లు ఢీకొని 32 మంది మృతి..

Greece: ఘోర ప్రమాదం.. ఒకే ట్రాక్‌పై ప్రయాణిస్తున్న రెండు రైళ్లు ఢీకొని 32 మంది మృతి..
Greece: గ్రీస్‌లో రైళ్లు ఢీకొన్న ఘటనలో 32 మంది మృత్యువాత పడ్డారు.

Greece: గ్రీస్‌లో రైళ్లు ఢీకొన్న ఘటనలో 32 మంది మృత్యువాత పడ్డారు. మధ్య గ్రీస్‌లోని లారిస్సా నగరం వెలుపల ఏథెన్స్ నుండి ఉత్తర నగరమైన థెస్సలోనికీకి ప్రయాణిస్తున్న ఇంటర్‌సిటీ ప్యాసింజర్ రైలు కార్గో రైలును ఢీకొట్టిందని థెస్సాలీ ప్రాంత గవర్నర్ తెలిపారు. గ్రీస్‌లో రెండు రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో కనీసం 32 మంది మరణించారు మరియు 85 మంది గాయపడ్డారు. దీని ప్రభావంతో అనేక ప్యాసింజర్ క్యారేజీలలో మంటలు చెలరేగాయి. చాలా మంది ప్రయాణికులు తీవ్ర గాయాలతో వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో ప్యాసింజర్ రైలులోని మొదటి నాలుగు క్యారేజీలు పట్టాలు తప్పాయని, అయితే మంటల్లో చిక్కుకున్న మొదటి రెండు క్యారేజీలు "దాదాపు పూర్తిగా ధ్వంసమయ్యాయి". అని అధికారులు చెబుతున్నారు. రెండు రైళ్లు ఒకే ట్రాక్‌పై ఒకదానికొకటి దూసుకు రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చాలా వేగంతో వస్తున్న రైళ్లు ఒకే ట్రాక్‌పై వస్తున్నట్లు ఒకరి నుంచి మరొకరికి సమాచారం లేదు.

"రెండు రైళ్లు ఢీకొన్న తీవ్రతను బట్టి ప్రయాణికుల తరలింపు చాలా క్లిష్టంగా ఉంది అని అగ్నిమాపక దళ ప్రతినిధి వాసిలిస్ వర్తకోగియానిస్ టెలివిజన్ ప్రసంగంలో తెలిపారు. రాత్రి 7.30 గంటలకు (0530 GMT) ఏథెన్స్‌కు బయలుదేరిన ప్యాసింజర్ రైలులో సుమారు 350 మంది ప్రయాణిస్తున్నట్లు స్థానిక మీడియా నివేదించింది. అగ్నిమాపక దళం మంగళవారం అర్ధరాత్రి ప్రమాదం గురించి సమాచారం ఇచ్చిందని తెలిపారు. కార్గో రైలు థెస్సలోనికి నుండి లారిస్సాకు వెళుతోంది. 1972లో రెండు రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో 19 మంది చనిపోయారు. గ్రీస్ యొక్క ఏళ్లనాటి రైల్వే వ్యవస్థను ఆధునీకరించాల్సిన అవసరం ఉంది. అనేక రైళ్లు సింగిల్ ట్రాక్‌లపై ప్రయాణించడం జరుగుతోంది. సిగ్నలింగ్, ఆటోమేటిక్ కంట్రోల్ సిస్టమ్‌లు ఇంకా అనేక ప్రాంతాలలో వ్యవస్థీకరించాల్సి ఉంది.

Tags

Read MoreRead Less
Next Story