USA: తిరిగి వస్తున్న భారతీయ కళా సంపద

USA: తిరిగి వస్తున్న భారతీయ కళా సంపద
అమెరికా నుంచి త్వరలో భారత్ కు రానున్న 105 పురాతన కళాఖండాలు..

మోడీ పర్యటన ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఒకప్పుడు రకరకాల రకరకాల అక్రమ మార్గాల ద్వారా అమెరికాకు చేరిన కొన్ని పురాతన కళాఖండాలు మన దేశానికి చేరుతున్నాయి. అమెరికా ఇండియాల మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలే కాకుండా.. సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి ఉన్నాయి.. కానీ అవన్నీ భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన తరువాత బలపడుతున్నాయి. తాజాగా అమెరికాలో ఉన్న మన దేశానికి చెందిన పురాతన కళాఖండాల్లో కొన్నింటిని ఇండియాకు తిరిగి ఇచ్చేసింది. వీటిని మన దేశ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. త్వరలోనే అవి ఇండియాకు చేరుకోనున్నాయి. క్రీస్తుశకం 2 -3వ శతాబ్దం నుంచి 18-19వ శతాబ్దం వరకు ఉన్న మొత్తం 105 పురాతన వస్తువులను అమెరికా భారత్ కు తిరిగి ఇచ్చింది. వీటిని మన దేశానికి తీసుకొచ్చేందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. అమెరికాలో భారత రాయబారి తరణ్ జిత్ సింగ్ సంధు, కాన్సుల్ జనరల్ రణధీర్ జైస్వాల్, మాన్ హట్టన్ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయ అధికారుల సమక్షంలో న్యూయార్క్ లోని భారత కాన్సులేట్ జనరల్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కొన్ని విలువైన భారతీయ పురాతన కళాఖండాలను అమెరికా అందజేసింది.



ఈ సందర్బంగా మాట్లాడిన అమెరికాలో భారత రాయబారి తరణ్ జిత్ సింగ్ సంధు భారత్ కు తరలిస్తున్న 100 పురాతన వస్తువులు కేవలం కళ మాత్రమే కావని, మన వారసత్వం, సంస్కృతి, మతంలో భాగమని అన్నారు. కోల్పోయిన ఈ వారసత్వం ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఎంతో భావోద్వేగాన్ని అనుభవిస్తున్నానన్నారు. త్వరలోనే ఇతర పురాతత్వ వస్తువులు కూడా భారత్ కు వస్తాయని తెలిపారు.

పురాతన వస్తువులను వెనక్కి తెచ్చుకోవడంలో సహాయం చేస్తున్న మాన్హాటన్ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం, హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అధికారులు, ఇతర ఏజెన్సీలకు కృతజ్ఞతలు తెలిపారు. గత నెలలో ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించిన సందర్భంగా భారత్ కోల్పోయిన ఈ సాంస్కృతిక ఆస్తులను తిరిగి ఇవ్వడానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అంగీకరించారు. దీంతో అమెరికా అధ్యక్షుడికి ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు. 2016లో ప్రధాని మోడీ అమెరికా పర్యటన సందర్భంగా 16 పురాతన వస్తువులను మొదటి సారిగా అమెరికా అందజేసింది. 2021 సెప్టెంబర్ లో ప్రధాని అమెరికా పర్యటన తర్వాత భారత్ కు 157 కళాఖండాలను అప్పగించింది.

Tags

Read MoreRead Less
Next Story