యుఎస్‌లో మరో భారతీయ విద్యార్ధి మృతి.. గుంటూరు జిల్లాకు చెందిన..

యుఎస్‌లో మరో భారతీయ విద్యార్ధి మృతి.. గుంటూరు జిల్లాకు చెందిన..
ఆంధ్రప్రదేశ్‌ గుంటూరు జిల్లాకు చెందిన అభిజిత్ పరుచూరు బోస్టన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్నాడు.

ఆంధ్రప్రదేశ్‌ గుంటూరు జిల్లాకు చెందిన అభిజిత్ పరుచూరు బోస్టన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా బుర్రిపాలెంకు చెందిన అభిజిత్ పరుచూరు బోస్టన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విద్యార్థి కాగా, అతని తల్లిదండ్రులు పరుచూరి చక్రధర్ మరియు శ్రీలక్ష్మి .

అతని కుటుంబీకుల కథనం ప్రకారం, మార్చి 11న యూనివర్శిటీ క్యాంపస్‌లో గుర్తుతెలియని వ్యక్తులు అతన్ని హత్య చేసి, మృతదేహాన్ని కారులో ఉంచి ఆ కారును అడవిలో వదిలివెళ్లారు.

స్నేహితుల ఫిర్యాదు మేరకు సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతడి మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. అయితే ప్రాథమిక విచారణలో అనుమానాస్పదంగా ఏమీ లేదని న్యూయార్క్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా తెలిపారు.

కాన్సులేట్ "అతని మృత దేహాన్ని భారత్ కు పంపడానికి సహాయం అందించింది". ఈ విషయంలో స్థానిక అధికారులతో పాటు భారతీయ-అమెరికన్ కమ్యూనిటీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కాన్సులేట్ తెలిపింది.

2024 ప్రారంభం నుండి, USలో భారతీయ సంతతికి చెందిన విద్యార్థులు కనీసం తొమ్మిది మరణాలు సంభవించాయి. చదువుల నిమిత్తమో, ఉద్యోగాల నిమిత్తమో వెళ్లిన వారి గురించి భారతీయులు ఆందోళన చెందుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story