Canada : భారత ఇంటెలిజెన్స్ చీఫ్‌ను బహిష్కరణ ఎందుకంటే...

Canada : భారత ఇంటెలిజెన్స్ చీఫ్‌ను బహిష్కరణ ఎందుకంటే...
ఖలిస్థానీ ఉగ్రవాది హత్యలో భారత్‌ పాత్ర.. ఆరోపించిన కెనడా ప్రధాని

కెనడా-భారత మధ్య ఖలిస్తానీ చిచ్చు ఆరడం లేదు సరికదా మరికొంత రగులుకొంటోంది . రెండు దేశాల మధ్య ఇప్పటికే దౌత్యసంబంధాలు కొంతవరకు చెడిపోయాయి. ఈ నేపథ్యంలో కెనడా ప్రధాని భారత్ వ్యతిరేఖంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది హత్యలో భారత్ పాత్ర ఉందంటూ సంచలన ఆరోపణలు చెయ్యడంతో ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తత మొదలైంది.

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఖలిస్తానీ ఉగ్రవాదిని చంపిన కేసులో భారతీయ ఏజెంట్లకు సంబంధం ఉందని తమ ప్రభుత్వం వద్ద నమ్మదగిని ఆరోపణలు ఉన్నాయి అని సోమవారం మధ్యహ్నం సమయంలో పార్లమెంటరీ ప్రతిపక్షాల అత్యవసర సమయంలో చెప్పారు. ఈ విషయంపై సహకరించాల్సిందిగా భారత ప్రభుత్వానికి పిలుపునిచ్చారు. అంతే కాదు ఈ నేపథ్యంలో కెనడా భారతదేశంపై ప్రతీకార చర్యలను చేపట్టింది. విదేశాంగమంత్రి మెలానీ జోలీ, భారత అగ్రశ్రేణి దైత్యవేత్తను బహిష్కరించినట్టుగా తెలిపారు. తాము భారత గూఢచారి సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా) అధిపతిని బహిష్కరించినట్లు జోలీ తెలిపారు. అయితే ఆ అధికారి పేరును నేరుగా చెప్పలేదు.


ఖలిస్తానీ ఉద్యమం, భారత వ్యతిరేఖ చర్యలకు పాల్పడుతున్న కెనడా పౌరుడైన హర్దీప్ సింగ్ నిజ్జర్ ను జూన్ 18న వాంకోవర్ లోని సర్రేలో గుర్తు తెలియని వ్యక్తుల కాల్చి చంపారు. సిక్కులకు కేంద్రంగా ఉండే సర్రేలో ఈ ఘటన జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే సమయంలో పాకిస్తాన్, యూకేల్లో కొందరు ఖలిస్తానీ వేర్పాటువాదులు కూడా ఇలాగే మరణించారు. భారత్ నుంచి పంజాబ్ ని విడదీసి సిక్కు దేశాన్ని ఏర్పాటు చేయాలని నిజ్జర్ పలుమార్లు పిలుపునిచ్చాడు.

భారత్ తరువాత కెనడాలోనే అత్యధిక మంది సిక్కులు ఉన్నారు. ఈ హత్య తర్వాత ఇండియా-కెనడా మధ్య మాటల యుద్దం పెరిగింది. దౌత్యపరంగా కూడా దూరం పెరుగుతూ వస్తోంది. సిక్ రైట్ వింగ్ కార్యకర్తలను హ్యాండిల్ చేయడంలో కెనడా విఫలమైందని భారత్ ఆరోపిస్తోంది. ఇండియాలో ప్రత్యేక సిక్కు దేశం కోసం కెనడాలో ఆందోళనలు చేస్తున్న కార్యకర్తలపై కెనడా మెతక వైఖరి ప్రదర్శిస్తోందని భారత్ అంటోంది. దీనిపై ప్రధాని ట్రూడో మాజీ సలహాదారు జోసెలిన్ కూలన్ స్పందించారు. విదేశాల్లో రాజకీయ హత్యలు చేసే దేశాల సమూహంలో భారత్ చేరుతుందని ఆయన అన్నారు.




Tags

Read MoreRead Less
Next Story