Maldives: మాల్దీవులకు ఇండియన్స్ బిగ్ షాక్.

Maldives: మాల్దీవులకు ఇండియన్స్ బిగ్ షాక్.
టాప్ నుంచి ఐదో స్థానానికి పడిపోయిన భారత పర్యాటకులు

ప్రధాని మోదీ జనవరి 2న లక్షద్వీప్‌ పర్యటన తర్వాత మాల్దీవులతో తలెత్తిన దౌత్యపరమైన వివాదం ఆ దేశ పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భారత్‌ నుంచి మాల్దీవుల పర్యటనకు వెళ్తున్న వారి సంఖ్య 3 వారాల్లోనే భారీగా తగ్గింది. గతేడాది మాల్దీవులకు వెళ్లిన విదేశీ పర్యాటకుల్లో 2 లక్షలకు పైగా మందితో భారత్‌.... అగ్ర స్థానంలో నిలవగా తాజా వివాదంతో ఆ ర్యాంకింగ్ ఐదో స్థానానికి పడిపోయింది.

ప్రధాని మోదీ లక్ష్యదీప్ పర్యటన తర్వాత మాల్దీవులతో నెలకొన్న వివాదం ఆ దేశ పర్యాటకంపై చూపుతున్న ప్రభావం అధికారిక లెక్కల్లో స్పష్టంగా కనిపిస్తోంది. భారత్ నుంచి మాల్దీవుల పర్యటనకు వెళ్లే వారి సంఖ్య మూడు వారాల వ్యవధిలో 8 శాతానికి తగ్గింది. గతేడాది మాల్దీవులకు విదేశీ ప‌ర్యాటకుల రాకలో.. భారత్‌ అగ్రస్థానంలో ఉండగా, ఇప్పుడు ఐదో స్థానానికి పడిపోయింది. భారత సెలెబ్రెటీలు ప్రముఖులు, సామాన్యుల నుంచి ఎదురైన వ్యతిరేకతే ఇందుకు కారణమైంది. ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన వివాదం నెలకొనగా, మాల్దీవుల పర్యాటకంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి.


మాల్దీవుల పర్యాటక శాఖ తాజాగా విడుదల చేసిన లెక్కలను పరిశీలిస్తే గతేడాది డిసెంబర్‌ 31 నాటికి 2 లక్షల 9 వేల 198 మంది పర్యాటకులతో భారత్‌ అగ్రస్థానంలో ఉండేది. అప్పుడు మాల్దీవుల్లో భారత సంద్శకుల వాటాదాదాపు 11 శాతంగా ఉంది. వివాదం తర్వాత ఈనెల 28 వరకు మాల్దీవుల టూరిజంలో భారత్‌ వాటా 8 శాతానికి పడిపోయింది.ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 13 వేల 989 మంది భారతీయులు మాత్రమే మాల్దీవుల్లో పర్యటించారు. ఈ ఏడాది జనవరి నెలలో అత్యధిక మంది పర్యాటకులను మాల్దీవులకు పంపిన దేశాల్లో 18 వేల561 మందితో రష్యా తొలి స్థానంలో నిలిచింది. 18 వేల 111 మంది టూరిస్టులతో రెండో స్థానంలో ఇటలీ, 16 వేల 529 మంది సందర్శకులతో మూడోస్థానంలో చైనా నిలిచింది. 14 వేల 588 మంది టూరిస్టులతో నాలుగో స్థానంలో యూకే ఉంది.

కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్‌లో ప్రధాని మోదీ జనవరి 2 పర్యటించారు. కొంతసేపు సముద్రం ఒడ్డున సేద తీరి అనంతరం అక్కడి నీటిలో స్నార్కెలింగ్‌ చేశారు. సాహసాలు చేయాలనుకునే వారు తమ లిస్ట్‌లో లక్షద్వీప్‌ను కూడా చేర్చుకోవాలని కోరుతూ అక్కడి ఫొటోలను ప్రధాని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీనిపై మాల్దీవులు ఎంపీ జహీద్‌ రమీజ్‌ అక్కసు వెళ్లగక్కారు. పర్యాటక రంగంలో.. మాల్దీవులతో పోలిస్తే లక్షద్వీప్‌ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోందని ట్వీట్ చేశారు. తర్వాత మాల్దీవుల మంత్రులు ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై భారత నెటిజెన్ల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. మాల్దీవుల పర్యటనను మానుకోవాలని పోస్టులు ట్రెండ్ అయ్యాయి. ఈ పరిణామాలు ఆ దేశ పర్యాటకంపై తీవ్ర ప్రభావం చూపాయి.

Tags

Read MoreRead Less
Next Story