కొలంబియాలో కూలిన విమానం.. ఇద్దరు భారతీయ ట్రైనీ పైలట్లు మృతి

కొలంబియాలో కూలిన విమానం.. ఇద్దరు భారతీయ ట్రైనీ పైలట్లు మృతి
కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో విమానం కూలిపోవడంతో ఇద్దరు భారతీయ ట్రైనీ పైలట్లు మృతి చెందారు.

కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో శనివారం జరిగిన విమాన ప్రమాదంలో ఇద్దరు భారతీయ ట్రైనీ పైలట్లు మరణించినట్లు అధికారి తెలిపారు. ఇద్దరు పైలట్లు ముంబైకి చెందిన అభయ్ గాడ్రూ, యశ్ విజయ్ రాముగాడే. పైపర్ పీఏ-34 సెనెకా అనే ట్విన్ ఇంజన్‌తో కూడిన తేలికపాటి విమానం చిల్లివాక్ నగరంలోని ఓ మోటెల్ వెనుక ఉన్న చెట్లు, పొదలపై కూలిందని కెనడా పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు భారత పైలెట్లే కాకుండా మరో పైలట్ కూడా మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. విమాన ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. కెనడా రవాణా భద్రతా బోర్డు ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించింది.

Tags

Read MoreRead Less
Next Story