అలా చేస్తే టీడీపీకి పట్టిన గతే వైసీపీకి పడుతుంది: కన్నా

అలా చేస్తే టీడీపీకి పట్టిన గతే వైసీపీకి పడుతుంది: కన్నా

ప్రధాని మోదీ సమర్ధవంతమైన పాలనకు ఆకర్షితులయ్యే..ఏపీలో వివిధ పార్టీల నేతలు బీజేపీలో చేరుతున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరితో కలిసి అయన శ్రీకాకుళంలో పర్యటించారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం పోలీసులతో పాలన సాగించాలని చూస్తే..టీడీపీకి పట్టిన గతే పడుతుందని కన్నా హెచ్చరించారు. విభజన అనంతరం ఏపీ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం సహకారం అందించినా..ప్రజల్లో బీజేపీని దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని పురందేశ్వరి అన్నారు. ఈ సందర్భంగా గృహనిర్మాణ సంస్థ మాజీ డైరెక్టర్ నడికుదిటి ఈశ్వరరావుతో పాటు ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు బీజేపీలో చేరారు.

Tags

Read MoreRead Less
Next Story