చంద్రబాబుపై పోస్టులు పెట్టిన నాగేశ్వరరావుపై చర్యలు తీసుకోవాలి:వర్ల రామయ్య
By - TV5 Telugu |30 July 2019 12:21 PM GMT
చంద్రబాబు చనిపోయినట్లుగా దండలు వేసిన ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టడం హేయమైన చర్య అన్నారు టీడీపీ నేత వర్ల రామయ్య. వైసీపీ వాళ్లకు అధికారం ఉంది కదా అని.. ఇష్టానుసారం వ్యవహరిస్తూ భయపెట్టాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. జగన్ తన కేడర్ను అదుపులో పెట్టుకోవాలని వర్ల రామయ్య హితవు పలికారు. చంద్రబాబుపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన నాగేశ్వరరావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com