వాళ్ళ దాడులకు మేము భయపడం: మురళీధర్రావు

X
By - TV5 Telugu |31 July 2019 6:24 PM IST
టీఆర్ఎస్ దాడులకు భయపడేవారు ఎవ్వరూ లేరన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు. పోలీసు యంత్రాంగాన్ని అధికార పార్టీ దుర్వినియోగం చేస్తుంటే ఊరుకోబోమని హెచ్చరించారాయన. వారం కిందట హైదరాబాద్ ఆనంద్ బాగ్లో RUB పనులపై జరిగిన సమావేశంలో టీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో గాయపడ్డ బీజేపీ కార్యకర్తలను మురళీధర్ రావు పరామర్శించారు. ఈ సమావేశంలో బీజేపీ కార్యకర్తలు కేవలం ప్ల కార్డులు పట్టుకొని మౌనంగా నిరసన మాత్రమే తెలిపారన్నారాయన. నిరసన తెలుపుతున్న వారిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడం దారుణమని చెప్పారు. బీజేపీ కార్యకర్తలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com