డివైడర్ను ఢీకొట్టిన కారు.. 20 అడుగులు ఎత్తుకు ఎగిరి పొలంలో పడిన..
By - TV5 Telugu |11 Oct 2019 10:38 AM GMT
షాద్నగర్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి అనంతపురం బయలుదేరిన మారుతి ఎర్టిగా కారు.. మరో కారును ఓవర్ టేక్ చేయబోయి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు పల్టీలు కొడుతూ.. రోడ్డు పక్కనే ఉన్న పొలంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే చనిపోగా.. మరో నలుగురు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చేరారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ దుర్ఘటనలో ఓ యువకుడు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ప్రమాదం సమయంలో కారులో 8 మంది యువకులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఓ యువకుడి మృతదేహం.. 20 అడుగులు ఎత్తుకు ఎగిరి పొలంలో పడింది. ఈ మార్గంలో భారీ ట్రాఫిక్జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com