చంద్రబాబు దీక్ష.. కిక్కిరిసిన ధర్నా చౌక్

X
By - TV5 Telugu |14 Nov 2019 10:38 AM IST

ఆంధ్రప్రదేశ్లో ఇసుక కొరతను నిరసిస్తూ టీడీపీ అధినేత, విపక్ష నేత చంద్రబాబు నాయుడు దీక్షచేస్తున్నారు. విజయవాడ ధర్నాచౌక్లో ఆయన 12 గంటల దీక్ష మొదలైంది. ఉపాధి లేక ఆత్మహత్య చేసుకున్న వాళ్లకు నివాళులు అర్పించి చంద్రబాబు దీక్షలో కూర్చుకున్నారు. గురువారం బాలల దినోత్సవం సందర్భంగా నెహ్రూకి నివాళులు అర్పించారు. మహాత్మాగాంధీ, ఎన్టీఆర్ చిత్రపటాలకు కూడా అంజలి ఘటించారు. చంద్రబాబుతో పాటు పలువురు భవన నిర్మాణ కార్మికులు దీక్షలో కూర్చున్నారు. అటు, ఈ నిరసన దీక్షకు భారీగా టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు. ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు కూడా మద్దతు తెలిపిన నేపథ్యంలో.. పెద్ద ఎత్తున తరలివచ్చిన వాళ్లతో ధర్నా చౌక్ కిక్కిరిసిపోయింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

