చంద్రబాబు, జగన్ పాలనలో రాష్ట్రం కుంటుపడింది: బీజేపీ విష్ణు వర్ధన్ రెడ్డి

X
By - TV5 Telugu |24 Dec 2019 3:35 PM IST
ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబుల తీరుపై రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు వర్ధన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఇద్దరి పాలన కారణంగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది అన్నారు. అమరావతిలో రైతులు చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలిపిన ఆయన.. రాజధాని రైతుల సమస్యలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పాలన వికేంద్రీకరణ కాదు.. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పరిపాలన వికేంద్రీకరణను ప్రభుత్వం రివర్స్లో చేస్తోందని విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com