గ్రహణం వీడటంతో తెరుచుకోనున్న ఆలయాలు

గ్రహణం వీడటంతో తెరుచుకోనున్న ఆలయాలు
X

grahanam

గ్రహణం వీడటంతో తెలుగురాష్ట్రాల్లో ఆలయాలు తెరుచుకోనున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయం సంప్రోక్షణ అనంతరం మధ్యాహ్నం 2 గంటల తర్వాత భక్తులకు సర్వదర్శనాన్ని కల్పించనున్నారు. ఆలయం శుద్ది, పుణ్యహావాచనం నిర్వస్తున్నారు. తోమాల, అరల్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. గ్రహణం వీడటంతో.. స్వామి వారి పుష్కరిణలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు భక్తులు. మరోవైపు అన్నవరం ఆలయం మధ్యాహ్నం 3 గంటలకు తెరువనున్నారు. బెజవాడ దుర్గ గుడి కూడా సాయంత్రం 5 గంటలకు తెరుచుకోనుంది. ఆలయ శుద్ధి అనంతరం భక్తులను అనుమతిస్తారు. సింహాద్రి అప్పన్న ఆలయం సైతం సాయంత్రం 4 గంటలకు తెరువనున్నారు. శ్రీశైలం ఆలయంలో మహాసంప్రోక్షణ అనంతరం ఆలయం తెరుచుకోనుంది.

అటు.. సంప్రోక్షణ తర్వాత యాదాద్రి ఆలయం మధ్యాహ్నం 2 గంటలకు ఆలయం తెరుచుకోనుంది. ఇప్పటికే బాసర సరస్వతి ఆలయం తెరుచకుంది. సంప్రోక్షణ అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయం మూసివేసిన అధికారులు.. సంప్రోక్షణ తర్వాత 3.30 గంటలకు భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు.

Tags

Next Story