యాదాద్రికి పోటెత్తిన భక్తులు

X
By - TV5 Telugu |1 Jan 2020 11:45 AM IST
నూతన సంవత్సరం తొలిరోజు కావడంతో ఆలయాలు రద్దీగా మారాయి. యాదాద్రికి భక్తులు పోటెత్తారు. ఉదయం 5 గంటల నుంచే దర్శనాలు మొదలయ్యాయి. ఉదయం స్వామివారికి అభిషేకం నిర్వహించారు. రోజంతా రద్దీ కొనసాగనుంది. దీంతో.. భక్తుల సౌకర్యం కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భద్రతా కారణాలతో వాహనాలను కొండపైకి అనుమతించడం లేదు. కొత్త ఏడాదిలో తెలంగాణలోని ప్రజలందరూ పాడి పంటలతో, సంతోషంగా ఉండాలని యాదాద్రి దేవస్థానం అర్చకులు ఆశీర్వచనం పలికారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com