సీఎం జగన్ ఇంటి పరిసర ప్రాంతంలో మృతదేహం

X
By - TV5 Telugu |4 Jan 2020 1:20 PM IST

ఏపీ సీఎం జగన్ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఓ మృతదేహం లభించడం కలకలం రేగింది. అత్యంత కట్టుదిట్టమైన భధ్రత ఉండే సీఎం ఇంటి సమీపంలోనే డెడ్బాడీ కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. తాడేపల్లి సీతానగరం వద్ద మద్రాస్ కాలువ దగ్గర గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది.
ఎవరైనా హత్యచేసి ఇక్కడ పడేశారా లేదా సూసైడ్ చేసుకున్నాడా అనే వివరాలు తెలియాల్సి ఉంది. కాల్మనీ వ్యవహారంలో వారం క్రితం ప్రేమ్కుమార్ అనే విజయవాడకు చెందిన వ్యక్తి ఇదే ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి వయసు 50 ఏళ్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

