ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పదవతరగతి విద్యార్ధి..

X
By - TV5 Telugu |29 Jan 2020 11:07 PM IST
బాగా చదువుకుంటే మంచి మార్కులు వస్తాయి. పెద్దయ్యాక మంచి ఉద్యోగం వస్తుంది అని చెప్పిన అమ్మా నాన్న మాటల్ని అక్షరాలా ఆచరించింది మధుమిత. అప్పటిదాకా ఎందుకు ఇప్పడే చేద్దాం ప్రధానోపాధ్యాయురాలిని చేద్దాం అని నిర్ణయించింది స్కూలు యాజమాన్యం. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా పుదుపట్టు గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఇది జరిగింది. పాఠశాల నిర్వహించిన పదోతరగతి పరిక్షల్లో క్లాసులో మొదటి ర్యాంకు రావడంతో ఆమెను స్కూలుకి ఒక్క రోజు హెచ్ఎమ్ చేశారు. ఉపాధ్యాయులంతా ఆ రోజంతా విద్యార్ధి చెప్పినట్టు నడుచుకున్నారు. మిగిలిన విద్యార్ధులను ప్రోత్సహించేందుకే ఇలా చేసినట్లు టీచర్లు వెల్లడించారు. ప్రధానోపాధ్యాయురాలిగా ఒక రోజు వేతనం కూడా అందుకుంది మధుమిత.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com