చైనాలో చిక్కుకున్న తమ కుమార్తెను స్వదేశానికి రప్పించాలని కేంద్ర పెద్దలను కోరుతున్న జ్యోతి తల్లిదండ్రులు
BY TV5 Telugu10 Feb 2020 2:38 PM GMT

X
TV5 Telugu10 Feb 2020 2:38 PM GMT
వుహాన్లో చిక్కుకున్న తెలుగమ్మాయి జ్యోతి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో నంద్యాల ఎంపీ బ్రహ్మానందరెడ్డిని కలిసిన జ్యోతి కుటుంబ సభ్యులు.. తమ కూతురును తీసుకొచ్చేలా ప్రయత్నాలు చేయాలని కోరారు. ఈ మధ్యాహ్నం కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ను కూడా కలవనున్నారు. ఢిల్లీలో హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి ద్వారా కేంద్రమంత్రులను కలిసేందుకు యత్నం చేస్తున్నారు జ్యోతి కుటుంబ సభ్యులు. ఈ నెల 14న జ్యోతి వివాహం ఉండడంతో వీలైనంత త్వరగా తమ కుమార్తెను స్వస్థలానికి రప్పించే చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు. భారత్-చైనా మధ్య విమాన రాకపోకలు పూర్తిగా నిలిపివేయడంతో స్వదేశానికి రాలేని దీన స్థితిలో ఉంది జ్యోతి. దీంతో కనీసం చైనాలోని మరో సురక్షిత నగరానికైనా తరలించాలని ఆమె విజ్ఞప్తి చేస్తోంది.
Next Story
RELATED STORIES
Narendra Modi: యూఏఈ పర్యటనలో ప్రధాని మోడీ.. ఆలింగనంతో స్వాగతం పలికిన...
28 Jun 2022 3:15 PM GMTNarendra Modi: జర్మనీ-యూఏఈ పర్యటనలో ప్రధాని మోదీ బిజీబిజీ..
26 Jun 2022 4:00 PM GMTAmerica: అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కీలక నిర్ణయం.. కాల్పుల మోతకు ఇక...
26 Jun 2022 3:00 PM GMTRupert Murdoch: నాలుగో భార్య కూడా నచ్చలేదు..! 91 ఏళ్ల వయసులో...
23 Jun 2022 11:15 AM GMTPakistan: మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలు.. అందుకే ఆ ప్రాంతంలో...
22 Jun 2022 11:45 AM GMTEthiopia: ఇథియోపియాలో మారణహోమం.. తిరుగుబాటుదారుల కాల్పుల్లో 200 మంది...
20 Jun 2022 11:00 AM GMT