అందమైన విశాఖ నగరాన్ని.. రౌడీరాజ్యంగా మార్చవద్దు: టీడీపీ ఎమ్మెల్సీ

X
By - TV5 Telugu |11 Feb 2020 10:27 PM IST
అందమైన విశాఖ నగరాన్ని.. రౌడీరాజ్యంగా మార్చవద్దని టీడీపీ ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్ అన్నారు. మరికొందరు ఎమ్మెల్సీలతో కలిసి సింహాచలం వరాహ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. తీర్మానం చేసినంత మాత్రాన మండలి రద్దు పూర్తి కాదని.. చాలా ప్రొసీజర్ ఉంటుందని చెప్పారు. ప్రజల కోసం పదవుల త్యాగానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. విశాఖపై భూ రాబందుల్లా వాలి.. వైసీపీ నేతలు మాఫియాలా తయారయ్యారని విమర్శించారు. ప్రజలే అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com