సీపీఐ రామకృష్ణ అరెస్ట్

X
వైసీపీ ప్రభుత్వంపై సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టసభల్లో చేసిన శాసనాలను అధికారులే దిక్కరించే పరిస్థితి రాష్ట్రంలో చూస్తున్నామని అన్నారు. కియా పరిశ్రమ తరలిపోతోందన్న ఆరోపణల నేపథ్యంలో.. ఆయన పెనుకొండలోని ప్లాంట్ ను సందర్శించేందుకు వెళ్లారు. అయితే అనంతపురంలో రామకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. జగన్ సర్కార్ నిర్వాకం వల్లే కియా వంటి పరిశ్రమలు ప్రమాదంలో పడ్డాయని ధ్వజమెత్తారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
