అంతమంది ప్రభుత్వ సలహాదారులు ఎందుకు?: దేవినేని ఉమా

X
By - TV5 Telugu |1 March 2020 12:33 AM IST
జగన్ సర్కార్ తీరుపై మాజీ మంత్రి దేవినేని ఉమ ఫైరయ్యారు. వైసీపీ నేతలేమో వేల ఎకరాల్లో ఇళ్లు కట్టుకొని.. పేదలకు మాత్రం సెంటు భూమి మాత్రమే ఇస్తారా అని నిలదీశారు. పైగా ఇళ్ల పట్టాల పేరుతో పేదల భూముల్ని బలవంతంగా లాక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో ఏకంగా ఫారెస్టు భూములకే ఎసరు పెట్టారని ఆరోపించారు. ప్రభుత్వ సలహాదారుల పేరుతో ప్రభుత్వం వెయ్యి కోట్లు వృథా చేస్తోందని విమర్శించారు. అంతమంది సలహాదారులు దేనికని ప్రశ్నించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com