ఓటర్ల జాబితాను అనుకూలంగా మార్చుకుంటున్న వైసీపీ
By - TV5 Telugu |11 March 2020 6:53 PM GMT
ఓ వార్డులోని ఓట్లు కచ్చితంగా టీడీపీకే పడతాయని.. అధికార వైసీపీ నేతలకు అర్థమైంది. ఇంకేముంది.. తన కపట బుద్ధిని చాటుకున్నారు. ఆ వార్డులోని ఓటర్లను.. వేరే వార్డుల్లోకి మార్చారు. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలిలోని పలు వార్డుల్లో చోటుచేసుకుంది. పట్టణంలోని 4,14,15,16 వార్డుల్లో టీడీపీకి బలంగా ఉంది. ఎలాగైనా టీడీపీ అభ్యర్థిని దెబ్బతీయాలని.. కుయుక్తులు పన్ని.. దాదాపు రెండు, మూడు వార్డులు దాటించి ఆ జాబితాలో కలిపారు. వైసీపీ నేతల కుతంత్రాలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఇలా వందలాది ఓటర్లను మార్చారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com