అవసరమైతే రెసిడెన్సియల్ స్కూల్స్, హాస్టల్స్ ఐసోలేషన్ సెంట్లరుగా మారుస్తాం: కిషన్ రెడ్డి

By - TV5 Telugu |20 March 2020 2:44 PM GMT
కరోనా కట్టడికి కఠిన చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దేశ సరిహద్దు గ్రామాలు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాల దగ్గర తనిఖీలు ముమ్మరం చేసినట్లు చెప్పారు. ఎయిర్ పోర్టుల్లో ఇప్పటివరకు 14 లక్షల 30 వేల మందికిపైగా ప్రయాణికులకు స్క్రీనింగ్ నిర్వహించామని అన్నారు. ప్రస్తుతం 70 వేల కిట్లు అందుబాటులో ఉన్నాయని.. మరో 10 లక్షల కిట్లకు త్వరలో అందుబాటులోకి రానున్నాయన్నారు. ప్రస్తుతం 37 వేల బెడ్లు సిద్ధంగా ఉన్నాయని, అవసరమైతే అన్ని రెసిడెన్సియల్ స్కూల్స్, హాస్టల్స్ ను ఐసోలేటెడ్ సెంటర్లుగా మార్చుతామని అన్నారు కిషన్ రెడ్డి.
Next Story
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com