కరోనా ప్రభావంతో అమరావతి జేఏసీ కీలక నిర్ణయం

కరోనా ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని అమరావతి జేఏసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై ప్రతి శిబిరంలో నియమిత సంఖ్యలో ఉద్యమకారులు పాల్గొంటారని తేలిపింది. ఒక్కొక్కరికి మధ్య 3 మీటర్ల దూరం పాటించాలని నిర్ణయించారు. రోజూ రాత్రి 7:30కి అమరావతి వెలుగు పేరుతో.. ప్రతి ఇంటిముందు కొవ్వత్తులు వెలిగించి నిరసనలు తెలుపనున్నారు. ఉద్యమం రూపుమారుతుందే కానీ.. ఉద్యమం మాత్రం కొనసాగుతుంది జేఏసీ నేతలు స్పష్టం చేశారు.
కరోనా నివారణకు ప్రధాని చేసిన సూచనలను పాటిస్తాసమని తెలిపారు జేఏసీ నాయకులు. జనతా కర్ఫ్యూకి పూర్తిస్థాయిలో సహకరిస్తామన్నారు. కర్ఫ్యూ సమయానికి ముందు, తర్వాత శిబిరాల్లో గంటపాటు కూర్చోవాలని నిర్ణయించారు..వందో రోజు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపై చర్చిస్తామన్నారు.. ప్రధాని మోదీ సూచన మేరకు పాటిస్తున్న జాగ్రత్తలను ప్రస్తావిస్తూ ఆయనకు లేఖ రాయనున్నారు జేఏసీ నేతలు.
RELATED STORIES
Tarun Chugh: తరుణ్ చుగ్ సంచలన వ్యాఖ్యలు.. ఫొటో ఎగ్జిబిషన్లో అవన్నీ...
1 July 2022 2:30 PM GMTKTR: ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ ఘాటు లేఖ.. రియల్ ఎజెండా అదేనంటూ...
1 July 2022 2:00 PM GMTTSRTC: శ్రీవారి భక్తులకు టీఎస్ఆర్టీసీ ఎండీ తీపికబురు..
1 July 2022 6:02 AM GMTSangareddy: ఆటోపై యువకుడి స్టంట్లు.. షాకిచ్చిన ట్రాఫిక్ పోలీసులు..
29 Jun 2022 1:12 PM GMTT-Hub 2.0: దేశంలోనే ప్రతిష్టాత్మక స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ హబ్-2...
28 Jun 2022 1:50 PM GMTLB Nagar: కన్నకొడుకే ఇంటి నుంచి తరిమేశాడు.. వృద్ద దంపతుల ఆవేదన..
28 Jun 2022 1:10 PM GMT