గుంటూరులో కరోనా కలకలం.. అధికారుల్లో నిర్లక్ష్యం.. మూతపడని స్కూల్స్

X
By - TV5 Telugu |21 March 2020 8:07 PM IST
గుంటూరులో కరోనా కలకలం రేగింది. ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన వ్యక్తికి కరోణా లక్షణాలు బయటపడ్డాయి. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా వున్నట్టు తెలుస్తోంది. నమూనాలు సేకరించిన అధికారులు టెస్టింగ్ కు పంపారు. ప్రస్తుతం జ్వరాల ఆసుపత్రిలో అనుమానితుడికి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు కరోనా పట్ల జిల్లాలో వైద్య అధికారులు అలర్ట్ గా వున్నా.. విద్యాశాఖ అధికారుల్లో మాత్రం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. స్కూల్స్ పూర్తిగా మూసివేయాలని కలెక్టర్ ఆదేశించినా.. కొన్ని స్కూల్స్ నడుస్తున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com