మహారాష్ట్రలో మరో 47 మందికి కరోనా పాజిటివ్

X
By - TV5 Telugu |4 April 2020 10:31 PM IST
కరోనా కేసులు మహారాష్ట్రలో రోజు రోజుకి పెరుగుతున్నాయి. తాజాగా మరో 47 కొత్తగా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 537కు చేరినట్టు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. తాజాగా నమోదైన 47 కేసుల్లో 28 కేసులు ముంబై నుంచి, థానే జిల్లా నుంచి 15, పుణె, అమ్రావతి, పింప్రి చించ్వాడ్ నుంచి ఒక్కో కేసు ఉంది.
కాగా.. దేశంలో కరోనా ప్రభావంమహారాష్ట్రలో ఎక్కువగా ఉండటంతో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com