కరోనా వైరస్ లో ఆంధ్రప్రదేశ్ ఏడో స్థానం
BY TV5 Telugu8 April 2020 8:10 AM GMT

X
TV5 Telugu8 April 2020 8:10 AM GMT
కరోనా వైరస్ వ్యాప్తితో ఏపీ దేశంలో ఏడవ స్థానంలో ఉంది. ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కరోనా పాజిటివ్ కేసులు 303కు చేరాయి. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలులో 74 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో సగం కర్నూలు, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లోనివే. 24గంటల వ్యవధిలో 45 కేసులు నమోదయ్యాయి. కరోనా పరీక్షా కేంద్రాల సామర్థ్యం పెంచడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. విశాఖ, గుంటూరు, కడప నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రాథమిక స్థాయిలోనూ పరీక్షల నిర్వహణకు అనుమతిచ్చింది. రాష్ట్రానికి 240 పరికరాలు రానున్నాయి. ఒక్కో పరికరంతో రోజుకు 20నమూనాలు పరీక్షించే అవకాశముంది.
Next Story