కరోనా నేపథ్యంలో మరో కీలక నిర్ణయం తీసుకున్న ఒడిశా ప్రభుత్వం

కరోనా నేపథ్యంలో మరో కీలక నిర్ణయం తీసుకున్న ఒడిశా ప్రభుత్వం
X

ఒడిశా ప్రభుత్వం లాక్‌డౌన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 30వరకూ లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్టు నవీన్ పట్నాయక్ ప్రకటన చేశారు. అన్ని రాష్ట్రాల సీఎంలతో మరోసారి చర్చించి లాక్‌డౌన్ పొడిగింపుపై నిర్ణయం తీసుకుంటామని మోడీ తెలిపారు. అయితే.. అంతకంటే ముందుగానే ఒడిశా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

వాస్తవానికి రాష్ట్రంలో కరోనా ప్రభావం తక్కువగానే ఉంది. 42 కేసులు మాత్రమే నమోదయ్యాయి. కరోనాకు ఒకరు బలైయ్యారు. కరోనా ప్రభావం తక్కువగా ఉన్నప్పుడే జాగ్రత్తలు తీసుకోకపోతే.. పరిస్థితి చేయి దాటినా తరువాత ఏమి చేయలేమని నవీన్ పట్నాయక్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే.. ఒడిశా బాటలో పలు రాష్ట్రాలు నడిచే అవకాశం కనిపిస్తుంది.

Tags

Next Story