తెలంగాణలో బుధవారం ఒక్కరోజే 37 కరోనా పాజిటివ్ కేసులు
By - TV5 Telugu |15 April 2020 10:37 PM GMT
తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే ఏకంగా 37 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 681కు చేరింది. బుధవారం 118 మందిని డిశ్చార్జ్ చేశామని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం 52 మందికి పాజిటివ్గా నిర్ధారించారు. అయితే మంగళవారం కంటే బుధవారం పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గింది. మంగళవారం కరోనాతో ఒకరు మృతి చెందగా.. బుధవారం ఎలాంటి మరణాలు లేకపోవడం గమనార్హం.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com