కరోనా కట్టడిలో మమత ప్రభుత్వం విఫలమైంది: పశ్చిమబెంగాల్ గవర్నర్
By - TV5 Telugu |15 April 2020 7:53 PM GMT
పశ్చిమబెంగాల్ ప్రభుత్వ తీరుపై ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్ఖర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో టీఎంసీ ప్రభుత్వం విఫలమైందని, ప్రజలను సామాజిక దూరం పాటింపచేయడంలో మమత ప్రభుత్వం 100 శాతం విఫలమైందని గవర్నర్ ట్విట్టర్ విమర్శించారు. పోలీసులు, పరిపాలనా అధికారులు లాక్డౌన్ నిబంధనలు పాటించలేదన్నారు. కరోనా వైరస్ కట్టడికి లాక్డౌన్ అమలు చేయలేకపోతే కేంద్ర ప్రభుత్వ సహాయం తీసుకోవాలని మమత ప్రభుత్వానికి గవర్నర్ సూచించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com