అగ్రరాజ్యంలో 30 వేలు దాటిన కరోనా మృతుల సంఖ్య

X
By - TV5 Telugu |17 April 2020 5:01 AM IST
అగ్రరాజ్యంలో కరోనా వైరస్ అతలకుతలం సృష్టిస్తోంది. ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా అమెరికాలో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 30,990కి చేరినట్టు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. కరోనా కారణంగా అత్యధిక మరణాలు అమెరికాలోనే నమోదయ్యాయి. అమెరికాలో 6.44 లక్షల మంది కరోనా బారిన పడగా.. 28,593 వైరస్ నుంచి కోలుకున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com