మందుబాబులకు గుడ్ న్యూస్.. మద్యం డోర్ డెలివరీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్!
ఇక ఓ వైపు కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు భయాందోళన కు గురవుతుంటే మరోవైపు మద్యం దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మందుబాబులు. అయితే మద్యం దొరక్క అల్లాడుతున్న మందుబాబులకు ఫుల్లు కిక్కిచ్చే గుడ్న్యూస్ చెప్పింది ప్రభుత్వం. ఇకపై మద్యాన్ని డోర్ డెలివరీ చేసేందుకు నిర్ణయించింది. అవును మీరు చదువుతున్నది నిజంగా నిజమే.. దుబాయ్ ప్రభుత్వం మద్యం డోర్ డెలివరీకి అనుమతి ఇచ్చింది.
లాక్ డౌన్ తో అందరూ ఇళ్లకే పరిమితమవడం, మద్యం షాపులు, బార్లు అన్ని మూసివేయడంతో ఆదాయం తగ్గిపోయింది. దీంతో దుబాయ్ ప్రభుత్వం మద్యం డోర్ డెలివరీకి అనుమతి ఇచ్చింది. దుబాయ్ లో మద్యం అమ్మకాలు చేపట్టే రెండు ప్రధాన కంపెనీలు.. ఆదాయానికి గండిపడకుండా డోర్ డెలివరీని చేపడుతున్నాయి. బీర్లు, స్పిరిట్, వైన్ ను రెండు కంపెనీలు ఇంటివద్దకే చేరుస్తున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com