తమిళనాడులో ఒక్కరోజే 105 కరోనా పాజిటివ్ కేసులు

X
By - TV5 Telugu |20 April 2020 4:08 AM IST
తమిళనాడులో కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది. ఆదివారం కొత్తగా 105 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 1477కు చేరింది. తమిళనాడులో కరోనాతో ఇప్పటివరకు 15 మంది మృతి చెందారని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com