కరోనా బారిన పడి లండ‌న్‌లో భార‌తీయ టీచ‌ర్ మృతి

కరోనా మరణాలు తీవ్రత ప్రపంచాన్ని భయపెడుతోంది. కరోనా విజృంభణ ధాటికి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,77,619 మంది కరోనాతో మృతి చెందారు. ఇక కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 25.56 లక్షలు దాటాయి. అత్యంత ప్రమాదకర కరోనా మహమ్మారి బ్రిటన్ ను సైతం పీల్చి పిప్పిచేస్తోంది. ప్రస్తుతం అక్కడ లక్ష 20 వేలు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక కరోనా బారి పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 16 వేలు దాటింది.

తాజాగా బ్రిట‌న్‌లో భార‌తీయ సంత‌తికి చెందిన‌ టీచ‌ర్ డాక్ట‌ర్ లూయిసా రాజ‌కుమారి.. కరోనా బారిన పడి మృతి చెందారు. లండ‌న్‌లోని కింగ్స్‌ఫ‌ర్డ్ కమ్యూనిటీ స్కూల్‌లో ఆమె ఇంగ్లీష్ టీచ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. స్కూట్ వెబ్‌సైట్‌లో హెడ్ టీచ‌ర్ జోవాన్ డెస్‌లాండ్స్ .. భార‌తీయ టీచ‌ర్‌కు నివాళి అర్పించారు. డాక్ట‌ర్ రాజ‌కుమారి మృతి ప‌ట్ల తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story