రాజస్థాన్ లో 2వేలు దాటిన కరోనా కేసుల సంఖ్య

X
By - TV5 Telugu |24 April 2020 11:50 PM IST
కరోనా ఎక్కువగా విస్తరిస్తున్న రాష్ట్రాల్లో రాజస్థాన్ కూడా ఉంది. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ తరువాత ఎక్కువ కేసులు రాజస్థాన్ లోనే నమోదవుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం కొత్తగా 44 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2008కి చేసురుకున్నాయి. అటు ఇప్పటి వరకు కరోనా మహమ్మారి 31 మందిని పొట్టన పెట్టుకుంది. కొత్తగా నమోదైన కేసుల్లో కోటా జిల్లాలో 18, జైపూర్లో 13, ఝలావర్లో 4, భరత్పూర్లో 1 కేసులు రిజిస్టరయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com