క్వారెంటైన్‌కు 14 మంది బీఎస్ఎఫ్ జ‌వాన్లు

క్వారెంటైన్‌కు 14 మంది బీఎస్ఎఫ్ జ‌వాన్లు
X

దేశంలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కట్టదిట్టమైన చర్యలు చేపట్టింది. కరోనా కట్టడి చేయడానికి లాక్ డౌన్ విధించి అమలు చేస్తోంది. ఈ లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌లో బార్డ‌ర్ సెక్యూరిటీ ఫోర్స్ కు చెందిన 14 మంది బీఎస్ఎఫ్ జ‌వాన్లు.. ఇటీవల ఆగ్రాలో పోలీసులకు సాయంగా 20 రోజులపాటు విధులు నిర్వర్తించారు. ఈ క్రమంలో వారి కోసం అక్కడ ఒక ప్రత్యేక క్యాంపు ఏర్పాటుచేశారు. ఆ క్యాంపు వంటగదిలో పనిచేసిన ఓ వ్యక్తికి క‌రోనా‌ పాజిటివ్‌గా తేలింది. దీంతో ముందస్తు జాగ్రత్తగా 14 మంది జ‌వాన్లు క్వారంటైన్‌కు తరలించారు. శనివారం సాయంత్రమే వీరంతా ఛత్తీస్‌గఢ్‌లోని బిలాయ్‌ పట్టణానికి చేరుకున్నారు. అక్కడికి వచ్చిన వెంటనే వీరి నమూనాలను సేకరించి క్వారెంటైన్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు.

Tags

Next Story