దేశంలో కరోనా ప్రభావం ఇలా ఉంది: ఆరోగ్యశాఖ మంత్రి హర్ష్ వర్ధన్

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్ష్ వర్ధన్.. డిపార్ట్మెంట్ బయోటెక్నాలజీ ఇన్స్టిట్యూట్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశంలో కరోనా ప్రభావం గురించి వివరిస్తూ.. 80 జిల్లాల్లో గత ఏడు రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ఆయాబున తెలిపారు. 47 జిల్లాల్లో గత 14 రోజులుగా, 39 జిల్లాల్లో గత 21 రోజులుగా, 17 జిల్లాల్లో గత 28 రోజులుగా ఒక్క కేసూ నమోదు కాలేదన్నారు.
రెండు వారాల క్రితం భారత్లో కరోనా కేసుల రెట్టింపునకు 8.7 రోజులు పడుతుండగా గత వారంలో 10.2 రోజులు పట్టిందని హర్ష్ వర్ధన్ తెలిపారు. గత మూడు రోజుల్లో కేసుల రెట్టింపునకు 10.9 రోజులు పట్టిందని చెప్పారు. దేశంలో 300 జిల్లాలు నాన్ హాట్స్పాట్గా ఉన్నాయని, 129 జిల్లాల్లో 50కి పైగా కరోనా కేసులున్నాయని హర్ష్ వర్ధన్ చెప్పారు. కాగా మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com