మహారాష్ట్రలో ప్లాస్మా థెరపీ చేయించుకున్న తొలి వ్యక్తి మృతి

X
By - TV5 Telugu |1 May 2020 9:03 PM IST
మహారాష్ట్రలో తొలిసారి ప్లాస్మా థెరపీ చేయించుకున్న కరోనా వ్యక్తి మృతి చెందాడు. 53 ఏళ్ల ఓ కరోనా పేషెంట్ మృతి చెందినట్టు ముంబైలోని లీలావతి ఆస్పత్రి సీఈవో డాక్టర్ రవిశంకర్ వెల్లడించారు. భారత వైద్య పరిశోధన మండలి అనుమతి మేరకు ప్లాస్మా థెరపీ చేస్తున్నామని.. మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే మంగళవారం ప్రకటించారు. అయితే.. మహారాష్ట్రలో ప్రయోగాత్మకంగా చేసిన ఈ చికిత్స ద్వారా ఇద్దరికీ మంచి ఫలితాలు రాగా. ఒకరు మృతి చెందారు.
కరోనాకు ఇప్పటి వరకు పూర్తి స్థాయి మందు కానీ, చికిత్స కాని, లేదు. అందుకు ప్రయోగాత్మకంగా పలు చికిత్సలు చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com